జూన్ 4న ఢిల్లీకి సీఎం రేవంత్

జూన్ 4న ఢిల్లీకి సీఎం రేవంత్

జూన్  4న సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లానున్నారు. పీసీసీ కార్యవ ర్గం, కేబినెట్ విస్తరణపై అధినాయకత్వం తో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్ప టికే పలుమార్లు హస్తిన వెళ్లి ఈ రెండు అంశాలపై చర్చించారు. 

పీసీసీ కార్యవర్గందాదాపుగా ఖరారైందనే ప్రచారం జరిగినప్పటికీ అది కాస్తా పెండింగ్ లో పడిపోయింది. ఇదే తరుణంలో ఏఐసీసీ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చారు. ఇక్కడే ఉంటూ పలు జిల్లాల నేతలతో మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. డిస్ట్రబెన్స్ ఉన్న జిల్లాల్లో అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 4 న ఢిల్లీ వెళ్లనున్న ఈ ఇరువురు నేతలు ఈ సారి పీసీసీ కార్యవర్గం, కేబినెట్ లో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీపై పూర్తి స్థాయి క్లారిటీతో వస్తారనే చర్చ ఉంది.

 జూన్ ఫస్ట్ వీక్ లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ కేబినెట్ లో ఇప్పటి వరకు 12 మంది ఉన్నారు. ఇంకా ఆరుగురికి చాన్స్ ఉంది. దీని కోసం ఇప్పటికే ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.