
గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెల్వదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు..ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని కామెంట్ చేశారు. ఎన్నారైని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షురాలిని చేసింది ఏ పార్టీనో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ను ఏకవచనంతో పేరు పెట్టి పిల్వడం ముఖ్యమంత్రి సంస్కారానికి నిదర్శనమన్నారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ మాట తీరు మారడం లేదన్నారు.
అంతకు ముందు మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు పదవులిచ్చిందే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాపైపోరాడింది కాంగ్రెస్ నేతలేనన్నారు. కేసీఆర్ కు పదవులిచ్చింది.. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇచ్చిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు సీఎం రేవంత్.
కాంగ్రెస్ కు భిక్ష పెట్టిందే కేసీఆర్: హరీశ్ రావు
కాంగ్రెస్ కు భిక్ష పెట్టిందే కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 14 నెలలకే వైఎస్ సర్కార్ నుంచి వైదొలిగామన్నారు. 610 జీవో అమలు చేయనందుకే వైఎస్ సర్కా్ర్ నుంచి వైదొలిగామని చెప్పారు. వైఎస్ హయాంలో తమతో ఉన్నది పీజేఆర్ మాత్రమేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ తో పొత్తుపెట్టుకుంటేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ ఏబీవీపీతో మొదలు పెట్టి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ఇలా పార్టీలు మారారు.. రేవంత్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెల్వదన్నారు. పార్టీలు మారని చరిత్ర తమదన్నారు