భారత్–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబుకు మహావీరచక్ర పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జవాన్ ఫ్యామిలీ ఈ పురస్కారం అందుకుంది. సంతోష్ బాబు తల్లి ,భార్య కు మహావీర చక్ర పురస్కారం అందజేశారు రాష్ట్రపతి. గతేడాది జూన్ లో తూర్పు లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీ దాడిని ప్రతిఘటించిన ఘటనలో అమెరుడైన కల్నల్ సంతోష్ బాబు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కల్నల్ సంతోష్ బాబుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో గతేడాది జూన్ 15న సంతోష్ వీరమణం పొందిన విషయం తెలిసిందే. సంతోష్ బాబు వీర మరణంతో తెలంగాణ ప్రభుత్వం ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తారు.
#WATCH | Col Santosh Babu accorded Mahavir Chakra posthumously for resisting Chinese Army attack while establishing an observation post in the face of the enemy in Galwan valley in Ladakh sector during Operation Snow Leopard.
— ANI (@ANI) November 23, 2021
His mother and wife receive the award from President. pic.twitter.com/vadfvXBz9M
2019 డిసెంబర్లో కల్నల్గా పదోన్నతి వచ్చింది. బిహార్ 16వ బెటాలియన్ కామాండింగ్ అధికారిగా ఉన్న కల్నల్ సంతోష్బాబు.. తాను నేతృత్వం వహిస్తున్న బలగాలతో గాల్వన్ లోయల్లో విధులకు వెళ్లారు. కల్నల్ సంతోష్బాబు తన సర్వీసు ఎక్కువ కాలం సరిహద్దులోనే పని చేశారు. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు.