డేటా ఎంట్రీ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి : సంతోష్

 డేటా ఎంట్రీ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి : సంతోష్

గద్వాల, వెలుగు: ప్రజా పాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీ ఫాస్టుగా కంప్లీట్ కావాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం ధరూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన డేటా ఎంట్రీ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.

ప్రతిరోజు పదివేల అప్లికేషన్లు ఎంట్రీ చేయాలని, ఒక్కొక్క ఆపరేటర్ కు 1000 అప్లికేషన్లు టార్గెట్ పెట్టాలన్నారు. 17 లోగా డేటా ఎంట్రీని కంప్లీట్ చేయాలన్నారు. అనంతరం మండలంలోని పార్షర్ల విలేజ్ లో ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. కలెక్టర్ తో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు, స్పెషల్ ఆఫీసర్ రమేశ్​ బాబు ఉన్నారు.