
యాదాద్రి, వెలుగు : ప్రస్తుత విద్యాసంవత్సరంలో గవర్నమెంట్కాలేజీలు, స్కూల్స్లో ఎక్కువ మంది అడ్మిషన్ పొందేలా చూడాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
లెక్చరర్లు, టీచర్లు కూడా స్టూడెంట్స్కు నాణ్యమైన విద్యను బోధించాలన్నారు. ఈ విద్యాసంవత్సరంలో పురగోగతి సాధించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మీటింగ్లో డీఆర్డీవో నాగిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, డీఈవో సత్యనారాయణ, ప్రిన్సిపాల్స్, హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.