పార్లమెంట్  ఎన్నికలను సజావుగా నిర్వహించాలి : సంతోష్

పార్లమెంట్  ఎన్నికలను సజావుగా నిర్వహించాలి : సంతోష్

గద్వాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్  సంతోష్  సూచించారు. వివిధ రాష్ట్రాల సీఈవోలు, జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసర్లు వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్​లో కలెక్టర్  మాట్లడుతూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్  ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

ఎలక్షన్  హ్యాండ్ బుక్ లో ప్రతి అంశాన్ని  చదివి తెలుసుకోవాలన్నారు. మోడల్  కోడ్  ఆఫ్  కండక్ట్  రూల్స్​ను వివరించారు. అడిషనల్​ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాసులు, ఆర్డీవో చంద్రకళ పాల్గొన్నారు.