
కూకట్పల్లి, వెలుగు: ఒకరిపై దాడి చేయడానికి వచ్చిన నలుగురు అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఏపీలోని కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గాలి వరప్రసాద్.. కేపీహెచ్బీ ధర్మారెడ్డి కాలనీలోని ఓ పీజీలో ఉంటున్నాడు. ఈ నెల17న అర్ధరాత్రి సమయంలో ముగ్గురు యువకులు, ఒక యువతి అతను ఉంటున్న పీజీకి వచ్చి వరప్రసాద్కోసం అడిగారు. దీంతో నిర్వాహకులు హాస్టల్లో ఉంటున్న గాలి వరప్రసాద్ను పిలిపించారు. అతను రాగానే ముఖం కూడా చూడకుండా దాడి చేశారు. అసలు విషయం తెలియడంతో నలుగురు నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.