INS విక్రాంత్ లో చోరీ

INS విక్రాంత్ లో చోరీ

భారత్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్న విమాన వాహక యుద్ధనౌక INS విక్రాంత్ లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నౌకలోకి చొరబడి కంప్యూటర్లను ధ్వంసం చేసి కంప్యూటర్లలోని విడిభాగాలను దోచుకెళ్లారు. ప్రస్తుతం కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో తుది మెరుగులు దిత్తుతున్నారు. అయితే ఆ నౌకలో చొరబడిన దుండగులు నాలుగు కంప్యూటర్లను ధ్వంసం చేసి అందులోని హార్డ్ డ్రైవ్ లు, ర్యామ్, ప్రాసెసర్లను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారుల ఫిర్యాదుతో పోలీసులు, నిఘావర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే చోరీ జరిగిన ప్రాంతంలో సీసీటీవీలు లేవని, విషయం తెలిసిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.