జీడిమెట్ల,వెలుగు: నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎస్ఎన్డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. నిజాంపేటలోని 9 ప్రాంతాల్లో రూ.84 కోట్లతో జరుగుతున్న పనులను సోమవారం పరిశీలించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా పనులు జరుగుతున్నా కనీసం 50 శాతం కూడా పూర్తి కాలేదన్నారు.
ఆచార్యకుంట నుంచి నిజాంపేటవరకూ బాక్స్ టైప్లో పనులు జరగాల్సి ఉండగా సిమెంట్ పైపులైన్లు వేస్తున్నారని.. దీంతో భవిష్యత్తుల్లో ఇబ్బందులు వస్తాయన్నారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టెండర్లో పొందుపరిచిన విధంగా పనులు చేయాలని, ఇష్టానుసారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నిజాంపేట అధ్యక్షుడు ఆకుల సతీశ్, నాయకులు పాల్గొన్నారు.