- లాలాపేట విజయ డెయిరీలో పాడి రైతుల ఆందోళన
సికింద్రాబాద్, వెలుగు : పెండింగ్ పాల బిల్లులు చెల్లించి, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, తెలంగాణ విజయ డెయిరీ పాడి రైతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం లాలాపేట విజయ డెయిరీ వద్ద ఆందోళనకు దిగారు.
సెక్యూరిటీ అడ్డుకోవడంతో బయటే కూర్చొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు సెక్యూరిటీని తోసుకుంటూ లోనికి వెళ్లి డెయిరీ ఎండీ ఆఫీసులో బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.
20 రోజుల్లో పెండింగ్బిల్లులు చెల్లిస్తామని ఎండీ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ.. 50 రోజులుగా పాల బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.