అధికార పార్టీని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి గొంతు నొక్కేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల తరపున ప్రశ్నిస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై ప్రభుత్వం చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని ట్వీట్ చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను నిమిషాల్లో అరెస్టు చేసే పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు వల్ల ఒక కుటుంబం బలైనా ఇప్పటి వరకు అరెస్ట్ చేయక పోవడాన్ని తప్పుబట్టారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తుంది అనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనమన్నారు.
అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
— Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) January 7, 2022
అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడిన వారి గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రజల తరుపున ప్రశ్నిస్తున్న #YouTube ఛానెళ్ల పైన దాడులు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్న. #SaveDemocracy