VIPని హత్య చేస్తే పేరొస్తుందని పొడిచాడు

VIPని హత్య చేస్తే పేరొస్తుందని పొడిచాడు

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సేట్ ను కత్తితో పొడిచిన నిందితుడు ఫర్హాన్ పాషా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఫర్హాన్ చెప్పిన విషయంతో షాక్ అయ్యారు. వీఐపీని హత్య చేస్తే పేరొస్తుందన్న ఉద్దేశంతోనే ఆయనను చంపాలనుకున్నట్లు చెప్పాడు.

ఫర్హాన్ ఫ్రెండ్స్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం ఫర్హాన్ తాను ఓ వీఐపీని హత్య చేయబోతున్నట్టు చెప్పాడని వారు తెలిపారు.  ఆ విషయాన్ని జోక్ గా తీసుకున్నామన్నారు. నిజంగానే ఇంత పని చేస్తాడని అనుకోలేదని విచారణలో చెప్పారు. మరోవైపు ఆదివారం రాత్రి ఈ హత్యాయత్నం జరిగిన తర్వాత ఫర్హాన్ కుటుంబం పరారైంది.

ఫర్హాన్ దాడిలో తీవ్రంగా గాయపడిన తన్వీన్ ICUలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు తెలిపారు. మరోవైపు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్యే గన్‌మెన్‌ను పోలీసు ఉన్నతాధికారులు తొలగించారు.