మంత్రి మల్లారెడ్డికి ఓటమి తప్పదు : తోటకూర వజ్రేశ్ యాదవ్

మంత్రి మల్లారెడ్డికి ఓటమి తప్పదు : తోటకూర వజ్రేశ్ యాదవ్
  • మేడ్చల్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్​యాదవ్

కీసర, వెలుగు : మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డికి ఓటమి తప్పదని ఆ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ అన్నారు. గురువారం కీసర చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన వజ్రేశ్​యాదవ్ కీసర ఆర్డీవో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నామినేషన్ ర్యాలీలో జనాలను చూశాక నా గెలుపు ఖాయమైందనే ధీమా వచ్చిందన్నారు. 

బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై జనం విసిగిపోయారని.. కాంగ్రెస్ ను గెలిపిచేందుకు జనమే స్వచ్చందంగా ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు ఉద్దమర్రి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.