కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వానికి కాలం చెల్లింది : వీర్లపల్లి శంకర్

కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వానికి కాలం చెల్లింది : వీర్లపల్లి శంకర్

షాద్​నగర్, వెలుగు : రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని లేమామిడి, నిడదవెల్లి, గాంధీ శంకర్​పల్లి, లింగందన గ్రామాల్లో వీర్లపల్లి శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు యాదవ్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు.

కర్నాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.ఈ 30న జరిగే ఎన్నికల్లో  హస్తం గుర్తుకు ఓటేసి వీర్లపల్లి శంకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని నాగరాజు కోరారు. కార్యక్రమంలో కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల, నాయకులు తాండ్ర శ్రవణ్ రెడ్డి, మహ్మద్ ఇబ్రహీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.