మోదీపై ఈసీకి కాంగ్రెస్​ కంప్లయింట్

మోదీపై ఈసీకి కాంగ్రెస్​ కంప్లయింట్

హైదరాబాద్​, వెలుగు: వేములవాడలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ  ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మాట్లాడారని ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్, దాని నాయకత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించాయని మోదీ అన్నారని, ఇది పూర్తిగా సత్యదూరమని ఈసీఈ రాజీవ్​కు కుమార్​కు  కాంగ్రెస్​ సీనియర్​ నేత నిరంజన్ ​ఫిర్యాదు చేశారు.

 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడానికి సంబం ధించి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రధాని ఆరోపించారని, కానీ కాంగ్రెస్ సర్కా రు విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని నిరం జన్​ చెప్పారు. ఘటనాస్థలిని సీఎం, ఇతర మం త్రులు స్వయంగా సందర్శించి, అక్కడికక్కడే పరిశీలించారని తెలిపారు.