హైదరాబాద్, వెలుగు: వేములవాడలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మాట్లాడారని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్, దాని నాయకత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించాయని మోదీ అన్నారని, ఇది పూర్తిగా సత్యదూరమని ఈసీఈ రాజీవ్కు కుమార్కు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడానికి సంబం ధించి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రధాని ఆరోపించారని, కానీ కాంగ్రెస్ సర్కా రు విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని నిరం జన్ చెప్పారు. ఘటనాస్థలిని సీఎం, ఇతర మం త్రులు స్వయంగా సందర్శించి, అక్కడికక్కడే పరిశీలించారని తెలిపారు.