మీ వల్లే లక్షలాది జీవితాలు నాశనమయ్యాయి

మీ వల్లే లక్షలాది జీవితాలు నాశనమయ్యాయి

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు మోడీ సర్కార్ మీద రాహుల్ కామెంట్స్ చేశారు. కరోనాను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని, దీంతో దేశంలో లక్షలాది మంది జీవితాలు అల్లకల్లోలంగా మారాయని చెప్పారు. ‘1 కోటి కరోనా కేసులు, 1.5 లక్షల మరణాలు! 21 రోజుల్లో కరోనాను జయిస్తామన్న ప్రధాని మోడీ మాటలు.. సరైన ప్రణాళిక లేని లాక్‌‌డౌన్ కారణంగా విఫలమయ్యాయి. దీని వల్ల దేశంలో లక్షలాది మంది జీవితాలు నాశనమయ్యాయి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.