రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిపై రంగంలోకి హైకమాండ్

రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిపై రంగంలోకి హైకమాండ్

హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలపై హైకమాండ్ ఆరా తీసింది. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే ఢిల్లీ వచ్చి మాట్లాడాలని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. 

అసమ్మతి నేతలను ఢిల్లీకి రావాలని ప్రియాంక గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. రేపటి అసమ్మతి నేతల మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుతో చాలామంది నేతలు ఇబ్బంది పడుతున్నట్లు ప్రియాంక గాంధీ దృష్టికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. మరోవైపు రేపు మరోసారి సమావేశం కావాలని సీనియర్ నేతలు నిర్ణయం తీసుకున్నారు.