కేసీఆర్​, హరీశ్​పై ఈసీకి ఫిర్యాదు చేస్తం: కాంగ్రెస్​ నేత జి. నిరంజన్

కేసీఆర్​, హరీశ్​పై ఈసీకి ఫిర్యాదు చేస్తం: కాంగ్రెస్​ నేత జి. నిరంజన్

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు అడ్డగోలుగా తిడుతున్నరని.. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ తెలిపారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ను దోకేబాజీ పార్టీ అని పరకాల సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారని చెప్పారు. తమ  మేనిఫెస్టోను.. 420 మేనిఫెస్టో అని పేర్కొన్నారన్నారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు.