రాజస్థాన్ శివాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు

రాజస్థాన్ శివాలయంలో  రాహుల్ ప్రత్యేక పూజలు

రాజస్థాన్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో కలిసి, బెనేశ్వర్ ధామ్‌లోని శివాలయంలో, దుంగార్ పూర్ వాల్మీకీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణ మందిరం, బ్రహ్మాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంత్ అచ్యూతానంద్ నుంచి శీర్వచనం తీసుకున్నారు. 132 కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేయనున్నారు రాహుల్ గాంధీ. దుంగార్ పూర్ లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా ఉదయ్ పూర్ బయల్దేరనున్నారు.