ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం నిర్వహిస్తుండటంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడి నేతలను అక్కడే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. టీటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీపతి సతీష్ను గత అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మారేడ్పల్లికి తరలించిన పోలీసులు ఆ తర్వాత లాలాగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.