ఎమ్మెల్యే దత్తత గ్రామంలో అధ్వానంగా రోడ్లు

ఎమ్మెల్యే దత్తత గ్రామంలో అధ్వానంగా రోడ్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేశారు. కోరుట్ల, వేములవాడ ప్రధాన రహదారిపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రమేశ్ బాబు దత్తత గ్రామంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని మండిపడ్డారు. రోడ్లను బాగు చేయాలని ఎమ్మెల్యేను కోరినా స్పందించలేదని ఆరోపించారు. 

గతంలోనే కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిక్షాటన చేసి మరీ రోడ్లను బాగు చేశామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. పట్టించుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు.