కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ పరామర్శించారు. వారిరువురూ ఈడీ కార్యాలయం నుంచి నేరుగా గంగారాం హాస్పిటల్కు చేరుకున్నారు. కోవిడ్ మహమ్మారి సోకడంతో అనారోగ్యం పాలైన సోనియా గాంధీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంకను హాస్పిటల్ కు వెళ్లి ఆమె యోగక్షేమాలు కనుకున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
Congress leaders Rahul Gandhi & Priyanka Gandhi Vadra reach Sir Ganga Ram Hospital in Delhi.
— ANI (@ANI) June 13, 2022
Congress interim president Sonia Gandhi was admitted to the hospital due to COVID-related issues on June 12. pic.twitter.com/BrvcKmVwCW
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ జూన్ 2న కరోనా బారినపడ్డారు. వైరస్ లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఆరోగ్యం కుదుటపడకపోవడంతో నిన్న ఆమెను సర్ గంగారాం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇదిలా ఉంటే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ జూన్ 8న ఈడీ ఎదుట హాజరుకావాలని దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. అయితే జూన్ 2న ఆమె కరోనా బారిన పడటంతో విచారణకు హాజరుకాలేకపోయింది. దీంతో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశించింది.