కాంగ్రెస్ నేతలు దేశం గురించి ఆలోచించాలి: అనురాగ్ ఠాగూర్

కాంగ్రెస్ నేతలు దేశం గురించి ఆలోచించాలి: అనురాగ్ ఠాగూర్

ఢిల్లీ: అవినీతిపరులకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. చైనా, కొరియా జపాన్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున  కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనురాగ్ ఠాగూర్ కరోనా కేసులు పెరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర కొనసాగించడం సరికాదన్నారు.  హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కరోనా పరీక్షలు చేయించుకున్నారా.. ?" అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఒక కుటుంబ ప్రయోజనాల గురించి ఆలోచించడం కంటే.. దేశం మంచి గురించి కాంగ్రెస్ నేతలు ఆలోచించాలని సూచించారు. మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కరోనాను అత్యుత్తమంగా ఎదుర్కొంటున్నామని మంత్రి అనురాగ్ ఠాగూర్ వివరించారు.