సీఎం కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

సీఎం కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

రిపబ్లిక్ డే వేడుకలను అధికారికంగా నిర్వహించని సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో జాతీయ జెండా ఎగరేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. కీలక పదవిలో ఉన్న సీఎం కేసీఆర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం దారుణమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇది గవర్నర్ ను కాదు.. భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగానికి కేసీఆర్ ఇచ్చిన గౌరవం ఇదేనా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.