ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు వ్యక్తిగత గోప్యత గుర్తుకురాలేదా .. కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల ఫైర్

ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు వ్యక్తిగత గోప్యత గుర్తుకురాలేదా .. కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల ఫైర్

హైదరాబాద్, వెలుగు: వ్యక్తిగత గోప్యత పేరుతో ఏసీబీ అధికారులకు తన ఫోన్ ను ఇచ్చేందుకు నిరాకరించిన కేటీఆర్ కు ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసినప్పుడు వ్యక్తిగత గోప్యత గుర్తుకు రాలేదా అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా కేటీఆర్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యాంగంలోని హక్కులన్నీ మీ కోసమే రాశారా.. అంటూ మండిపడ్డారు. మీ దాకా వస్తే గానీ వ్యక్తిగత గోప్యత అనేది గుర్తుకు రాదా.. అని నిలదీశారు. 

ఇతరుల గోప్యతను కాలరాసి ఎన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టారో మరిచిపోయారా.. అంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ‘కర్మ అనేది ఎవరి చిరునామాను మరిచిపోదు, ఎక్కడ ఉన్నా వెతుక్కొని మరీ ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్లిపోతుంది’ అంటూ ఎక్స్ లో కేటీఆర్ ను ఉద్దేశించి చామల పోస్టు చేశారు.