వాజ్‌పేయికి రాహుల్‌ గాంధీ నివాళి

వాజ్‌పేయికి రాహుల్‌ గాంధీ నివాళి

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటుగా పులువురు ప్రముఖులకు నివాళులర్పించారు. సదైవ్ అటల్ లోని వాజ్ పేయి సమాధి వద్ద పూలమాల ఉంచి రాహుల్ శ్రద్ధాంజలి ఘటించారు.  ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో యాత్ర  ఢిల్లీలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని  మహాత్మా గాంధీ, మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల స్మారక చిహ్నాల వద్ద రాహుల్ నివాళులర్పించారు.  

తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ యాత్ర కేరళ, అంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్  రాష్ట్రాల నుండి ఢిల్లీకి చేరుకుంది. అనంతరం ఉత్తరప్రదేశ్‌ మీదుగా యాత్రను కశ్మీర్‌ వరకు యాత్రను రాహుల్‌ కొనసాగించనున్నారు. జమ్మకశ్మీర్‌లో ముగిసేవరకు రాహుల్ 3570 కిలోమీటర్ల ప్రయాణించనున్నారు.