రాహుల్ గాంధీ చేతుల్లోనే కాంగ్రెస్ పార్టీ సేఫ్ అని ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీకి లేఖ రాసిన రేవంత్.. రాహుల్ తప్ప మరెవరూ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయలేరన్నారు. సోనియా కృషితోనే యూపీఏను అధికారంలో వచ్చిందన్నారు . దేశంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని.. మీరు ఎల్లప్పుడూ గౌరవాన్ని కాపాడుకున్నారని అన్నారు. సోనియా గాంధీ పార్టీ కోసం ,దేశం కోసం శ్రమించాన్నారన్నారు. 23 మంది కాంగ్రెస్ నాయకులు సోనియా లేఖ రాసిన విషయం నమ్మశక్యంగా లేదన్నారు. లేఖ రాయడం నిజమైతే దురదృష్టకరమన్నారు. సోనియా ప్రోత్సాహం తమపై ఉంచిన విశ్వాసంతో తామంతా కాంగ్రెస్లో ప్రయోజనం పొందామన్నారు. సోనియా నాయకత్వంపై, రాహుల్ పై ఉన్న నమ్మకానికి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది కాంగ్రెస్ కార్యకర్తల మద్దతు ఉందన్నారు రేవంత్.
see more news
ఒకే రోజు 61,408 కేసులు..57,468 మంది డిశ్చార్జ్
నా చిరకాల స్నేహితుడిని కోల్పోయాను