కాంగ్రెస్సే అభివృద్ధి చేసింది.. టీఆర్ఎస్ ఏమీ చేయలె

కాంగ్రెస్సే అభివృద్ధి చేసింది.. టీఆర్ఎస్ ఏమీ చేయలె

నల్గొండ: కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తామే చేశామని టీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, అయితే ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ హడావుడిగా నెల్లికల్ లిఫ్ట్ పనులు ప్రారంభించిందన్నారు. అభివృద్ధి జరగకపోతే టీఆర్ఎస్‌‌ను ఓడగొట్టండి అన్న కేసీఆర్ మాటకు ప్రజలు కట్టుబడి ఓటేయాలన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారని, కానీ ఏడేళ్లయినా వాటికి అతీగతీ లేదని విమర్శించారు.