రాహుల్ పాదయాత్రలో సోనియా, ప్రియాంక

రాహుల్ పాదయాత్రలో సోనియా, ప్రియాంక

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర.. దేశరాజధాని ఢిల్లీలో ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున రాహుల్ తో కలసి నడస్తున్నారు. ఇవాళ సోనియా, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా జోడోయాత్రలో పాల్గొన్నారు. ఢిల్లీ వీధుల్లో కిక్కిరిసిపోయే జన సందోహం మధ్య రాహుల్ పాదయాత్ర కంటిన్యూ అవుతుంది.

భారత్ జోడో యాత్ర ఇవాళ హర్యానాలోని బదర్‌పూర్‌ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి, పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీకి బదర్ పూర్ సరిహద్దు వద్ద ఘన స్వాగతం పలికారు. రాహుల్ వెంట హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ ఉన్నారు. ఇక ఢిల్లీలోని ఎర్రకోట వరకు రాహుల్ యాత్ర సాగనుంది. ఇక డిసెంబర్ 16 నాటికి రాహుల్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది.