బీజేపీ అభ్యర్థులపై కేసుల వివరాలు అందజేసిన పోలీసులు

బీజేపీ అభ్యర్థులపై కేసుల వివరాలు అందజేసిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులపై రాష్ట్రంలోని వివిధ పోలీస్‌‌‌‌ స్టేషన్లల్లో ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ హైకోర్టుకు తెలిపారు. పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వడం లేదంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్​పై మంగళవారం ఉదయం విచారణ కొనసాగింది. 

అయితే తిరిగి మధ్యాహ్నం పిటిషనర్‌‌‌‌ న్యాయవాది కోర్టుకు వచ్చి డీజీపీ నుంచి అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాల జాబితా అందిందని చెప్పడంతో పిటిషన్‌‌‌‌పై హైకోర్టు విచారణను ముగించింది.బీజేపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వలేదంటూ దుగ్యాల ప్రదీప్‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై ఉదయం విచారణ జరిగింది. కేసుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. లంచ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ తర్వాత పిటిషనర్‌‌‌‌ లాయర్‌‌‌‌ వచ్చి కేసుల వివరాల లిస్టు అందిందని చెప్పడంతో పిటిషన్‌‌‌‌పై విచారణను హైకోర్టు మూసివేసింది.