చితి మీద పెట్టిన తర్వాత శవం మారిందని ఫోన్.. ఆగిన అంత్యక్రియలు

చితి మీద పెట్టిన తర్వాత శవం మారిందని ఫోన్.. ఆగిన అంత్యక్రియలు

ఒకరి శవం.. మరొకరికి

కరోనాతో ప్రైవేట్​ హాస్పిటల్​లో ఇద్దరి మృతి

తారుమారైన మృతదేహాలు

అంత్యక్రియల చివరి నిమిషంలో గుర్తించిన కుటుంబీకులు

కామారెడ్డి/ఇందల్వాయి, వెలుగు: హాస్పిటల్ ​సిబ్బంది కారణంగా కరోనాతో మృతిచెందినవారి  డెడ్​బాడీలు తారుమారయ్యాయి. అంత్యక్రియల చివరి నిమిషంలో కుటుంబీకులు గుర్తించడంతో విషయం వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో  సికింద్రాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చేర్పించారు. నిజామాబాద్​ జిల్లా ఇందల్​వాయి మండలం గన్నారానికి చెందిన హన్మాండ్లు(58) కూడా కరోనాతో అదే హాస్పిటల్​లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరూ మృతిచెందారు. శనివారం హాస్పిటల్​ స్టాఫ్​ మృతదేహాలను ప్యాక్​ చేసి కుటుంబీకులకు అప్పగించారు. భిక్కనూరులో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కుటుంబీకులు చివరి నిమిషంలో ముఖం చూసి తమ వ్యక్తి కాదని గుర్తించారు. వెంటనే హాస్పిటల్​ దృష్టికి తీసుకెళ్లారు.  గన్నారంలోనూ కుటుంబీకులు అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తి చేసి మృతదేహాన్ని చితి మీద పెట్టారు. ఇంతలో హాస్పిటల్​ నుంచి ఫోన్​ చేసి డెడ్​బాడీ మారినట్లు  చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. హన్మాండ్లు మృతదేహాన్ని హాస్పిటల్​ సిబ్బంది కుటుంబీకులకు అప్పగించి మరో వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

For More News..

టెక్నీషియన్లకు రోజుకు రూ. 30 లక్షలు చెల్లించినా పవర్ ప్లాంట్ నడుస్తలే..

స్మార్ట్​ఫోన్​ కోసం యువతి సూసైడ్​

టీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్​కు కోటి రూపాయల భూమి రూ. 5 లక్షలకే