దేశంలో 95 లక్షలకు చేరువైన కరోనా కేసులు

దేశంలో 95 లక్షలకు చేరువైన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 36 వేల 604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 94 లక్షల 99వేల 414 కి చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 501 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 38 వేల 122కు చేరింది. నిన్న మరో 43 వేల 62 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ 89 లక్షల 32 వేల 647  మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 28వేల 644 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా10లక్ష96వేల 651 టెస్టులు చేశారు.