ఒకే వార్డులో 100 మందికి కరోనా

ఒకే వార్డులో 100 మందికి కరోనా

గ్రామంలో ఒకరిద్దరికి కరోనా సోకితేనే తీవ్రంగా భయపడుతుంటారు. అటువంటిది గ్రామంలోని ఒకే వార్డులో 100 మందికి కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది. కానీ, అలాంటి ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ మండలంలోని చిన్నగొల్లపల్లిలో కరోనా విజంభిస్తోంది. గ్రామంలోని ఒక వార్డులో 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. చనిపోయిన వారిని కమ్మరి వెంకన్న(45), జిట్టే బాబు( 50), బండి జంగయ్య(48)గా గుర్తించారు. కాగా.. కరోనా సోకిన వందమంది బాధితులు తమతమ ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్నారు.  గ్రామంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మిగతా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.