కరోనా సోకిన తండ్రీకొడుకులను గాంధీ ఆస్పత్రికి

కరోనా సోకిన తండ్రీకొడుకులను గాంధీ ఆస్పత్రికి

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మయూరి నగర్ లో కరోనా వైరస్ సోకిన తండ్రీ కొడుకులను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశామన్నారు మంత్రి హరీష్ రావు. రెండు రోజుల క్రితం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి నుంచి ఆయన కుమారుడికి కూడా వైరస్ సోకిందని చెప్పారు. ప్రస్తుతం వారిద్దరూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని…సాయంత్రం వరకు వారిద్దరినీ గాంధీ ఆస్పత్రికి తరలిస్తామన్నారు.

అంతేకాదు ఆ ఇంట్లో వారితో పాటు నివసిస్తున్న కుటుంబ సభ్యులతో పాటు పనిమనిషి కుటుంబ సభ్యులను, ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని కూడా క్వారైంటన్ కు తరలించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 750 కుటుంబాలకు ఇంటింటి సర్వే చేసి చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు ఇబ్బంది పడకుండ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు.