చావుకు పోతే 21 మందికి అంటింది

చావుకు పోతే 21 మందికి అంటింది

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్లోని శాంతినగర్ లో ఈ నెల 9న 55 ఏండ్ల మహిళ చనిపోయింది. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. నలభై మందికిపైగా అటెండయ్యారు. ఆమెకు అంతకుముందే చేసిన కరోనా టెస్టుల రిపోర్టులు రాగా.. పాజిటివ్అని తేలింది. అధికారులు వెంటనే అలర్టయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 40 మందిని గుర్తించి టెస్టులు చేయించగా.. శనివారం 21 మందికి పాజిటివ్గా తేలింది. వీళ్లంతా ఆ మహిళ ఫ్యామిలీ, చుట్టాలే. ఈ విషయం తెలియడంతో జహీరాబాద్ టౌన్లో టెన్షన్ మొదలైంది.

అధికారులు ఈ 21 మందికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న మరో 33 మందిని గుర్తించి క్వారంటైన్కు తరలించారు. శనివారం వారి నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా టెస్టుల కోసం పంపారు. ఇందులో ఎందరికి వైరస్ సోకుతుందోనన్న భయం వ్యక్తమవుతోంది. ఇక ఆందోల్ నియోజకవర్గంలోని హుల్గేర గ్రామానికి చెందిన 48 ఏళ్ల మహిళకు పాజిటివ్ వచ్చింది. ఇంతకుముందే ఊర్లో కరోనా సోకిన మరో మహిళకు ఈమె ప్రైమరీ కాంటాక్ట్. ఈమె ఇటీవలే కొందరిని కలిసిందని గుర్తించారు. దీంతో ఊర్లో కరోనా భయం పట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి