రైతుబంధు సంబరాల్లో పాటించని కరోనా జాగ్రత్తలు

రైతుబంధు సంబరాల్లో పాటించని  కరోనా జాగ్రత్తలు

రైతుబంధు సంబరాల్లో భాగంగా ఆసిఫాబాద్ లో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు లు పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత అంబేద్కర్ చౌక్ లో టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు మాస్కులు పెట్టుకోకుండా కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వస్తున్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్ర కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో.... టీఆర్ఎస్ నేతలు కరోనా జాగ్రత్తలు పాటించకున్నా పోలీసులు పట్టించుకోలేదని జనం ఫైర్ అయ్యారు.