నార్సింగి పోలీస్ స్టేషన్ లో 20 మంది పోలీసులకు కరోనా 

నార్సింగి పోలీస్ స్టేషన్ లో 20 మంది పోలీసులకు కరోనా 

రంగారెడ్డి జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో  కరోనా సోకిన పోలీసులు హోం ఐసోలేషన్ ఉన్నారు.  పోలీస్ స్టేషన్ లోకి ఎవ్వరినీ అనుమతించవద్దని ఉన్నత అధికారులు సూచించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫిర్యాదు దారుల కోసం ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేశారు అధికారులు. మాస్క్ లేకుండా ఎవ్వరినీ అనుమతించమని తెలిపిన పోలీసులు.. సామాజిక దూరాన్ని పాటించాలని చెబుతున్నారు.