హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీల్లో అవినీతి జరిగితే అందుకు ప్రజాప్రతినిధులూ బాధ్యులేనని, ఈ మేరకు కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఎంత పటిష్టంగా రూపొందించామో, అదేవిధంగా కొత్త మున్సిపల్ యాక్ట్ తీసుకురానున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం అమలు, కొత్త మున్సిపల్ చట్టంపై సోమవారం ప్రగతిభవన్లో మంత్రులు, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా తెచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయడానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని, ఇందు కోసం మనసు పెట్టి పనిచేయాల్సి ఉందని సూచించారు. పల్లెల్లో, మున్సిపాలిటీల్లో చేయడానికి పుష్కలంగా పని ఉందని, దానిని గుర్తించాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో పని వదిలిపెట్టి ఇంకెక్కడో ఏదో చేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. స్కూళ్లు, కాలేజీల్లో కనీస వసతులు కల్పిచాలని, పల్లెల్లో పచ్చదనం పెంచడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిచాలన్నారు. ఈ బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదేనని సీఎం స్పష్టం చేశారు. పట్టణాలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న తరుణంలో అక్కడి ప్రజలకు మేలైన పరిపాలన అందించాలని, అందుకే కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. ఇందులో అధికారులను, ప్రజాప్రతినిధులను బాధ్యులనూ చేయబోతున్నట్లు చెప్పారు. మంచికి క్రెడిట్ ఎట్లా ఉంటుందో, చెడుకు శిక్ష ఆ విధంగానే ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. మున్సిపల్ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందిస్తే ప్రజలకు అంత మేలైన సేవలు అందించగలుగుతామన్నారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల్లో అవినీతి జరిగితే ప్రజాప్రతినిధులు బాధ్యులే
- తెలంగాణం
- June 11, 2019
లేటెస్ట్
- గుమ్మడిదలలో ఘటన .. పసికందును కవర్లో చుట్టి పడేసిన్రు
- బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి: గడ్డం వంశీ కృష్ణ
- కొమ్మూరి ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
- Kalyan Ram: హీరో కళ్యాణ్ రామ్ మూవీ సెట్లో అగ్నిప్రమాదం.. రూ.4 కోట్ల నష్టం
- కార్ ఆక్సిడెంట్లో కాంగ్రెస్ లీడర్ మృతి
- తడిసిన వడ్లు కొనాలని రైతుల ఆందోళన
- అవినీతి, అక్రమాలకు కేరాఫ్ బీఆర్ఎస్ : కడియం శ్రీహరి
- కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తా : కడియం కావ్య
- అబద్ధాల కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దు : సునీతారెడ్డి
- బెల్లంపల్లి ఆస్పత్రిలో అన్నిరకాల సేవలు : అజయ్ కుమార్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు