అవినీతి, అక్రమాలకు కేరాఫ్​ బీఆర్​ఎస్ : కడియం శ్రీహరి

అవినీతి, అక్రమాలకు కేరాఫ్​ బీఆర్​ఎస్ : కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: అవినీతి, అక్రమాలకు కేరాఫ్​ బీఆర్​ఎస్​ పార్టీ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం ఇప్పగూడెంలో కాంగ్రెస్​ మండల కమిటీ అధ్యక్షుడు జూలకుంట్ల శిరీష్​రెడ్డి ఆధ్యక్షతన గురువారం కార్నర్​ మీటింగ్​ జరిగింది. సముద్రాల, రంగరాయగూడెం, కోమటిగూడెం, అక్కపల్లిగూడెం, తానేదార్​పల్లి, విశ్వనాథపురం, చంద్రుతండా గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు మీటింగ్​కు హాజరయ్యారు. చీఫ్​ గెస్ట్​గా ఎమ్మెల్యే కడియం శ్రీహరి,  పీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర హాజరయ్యారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై బీజేపీకి  పట్టింపులేదన్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డగా మారిన బీఆర్​ఎస్​ను ప్రజలు నమ్మడం లేదన్నారు.  కార్యక్రమంలో  పీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర, కాంగ్రెస్​ రాష్ట్ర, జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, తోట వెంకన్న, దైద ఇలిషన్​, ఇనుగాల వెంకటేశ్వర్​రెడ్డి, గొడుగు రాజయ్య, కత్తుల కట్టయ్య, పాల్గొన్నారు.