కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తా : కడియం కావ్య 

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తా : కడియం కావ్య 

గ్రేటర్​ వరంగల్, వెలుగు:  కాజీపేట రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తానని కాంగ్రెస్​  వరంగల్ పార్లమెంట్​ అభ్యర్థి  డాక్టర్​ కడియం కావ్య అన్నారు. గురువారం వరంగల్​ ప్రెస్​ క్లబ్​లో ఏర్పాటు చేసిన మీట్​ ది ప్రెస్​లో   ఆమె మాట్లాడారు.  హైదరాబాద్, వరంగల్​, భూపాలపల్లి నేషనల్​ హై వేను ఇండస్ట్రియల్​ కారిడార్​గా ఏర్పాటు చేసి  పరిశ్రమలను నెలకొల్పడానికి  కృషి చేస్తానన్నారు.  అలాగే రైతుల పొలాలకు నీళ్లు అందించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని తెలిపారు. కాకతీయుల కాలం నాటి  గొలుసు కట్టుచెరువుల ద్వారా   ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం  చేస్తానని హామీ ఇచ్చారు.   10ఏళ్లుగా కడియం ఫౌండేషన్​ సంస్థ ద్వారా    సేవలు అందించామని, వాటిని మరింత విస్తృతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్​ క్లబ్​ ప్రెసిండెంట్ వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, బీఆర్​ లెనిన్​  పాల్గొన్నారు.