బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు క్లీన్ చిట్ లభించింది. మరణించిన రెండేళ్ల తర్వాత ఈ కేసులో ఆయనను నిర్దోషి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖను నిర్వహించినప్పుడు ఒడిశాలోని తలబీరా-II బొగ్గు బ్లాక్ను అక్రమంగా హిండాల్కో ఇండస్ట్రీస్కు కేటాయించారన్న ఆరోపణలతో కేసు నమోదు అయింది. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
2015లో వెలుగు చూసిన ఈ కేసులో సీబీఐ విచారణ ఆదేశించారు. పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా , మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరాఖ్ లపై సీబీఐ చార్జీ షీట్ దాఖలు చేయగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా నిందితుడిగా పిలిపించింది సుప్రీంకోర్టు.
ఈ విషయంతో ట్రయల్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకోవడంలో పొరపాటు జరిగిందని, మన్మోహన్ సింగ్ కోర్టు సమన్లను సుప్రీంకోర్టు లో సవాల్ చేశారు. అయితే 2015 ఏప్రిల్ లో సమన్లపై స్టే విధించిన సుప్రీంకోర్టు సింగ్ విచారణ ఎదుర్కొనకుండా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ అప్పీలు పదేళ్లకు పైగా పెండింగ్లో ఉండగా, 2024 డిసెంబర్లో మన్మోహన్ సింగ్ మరణించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసి, మాజీ ప్రధానిపై విచారణను ముగించింది.
మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో 2024 డిసెంబర్ 26న మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు న్యూఢిల్లీలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
