కార్​ ఆక్సిడెంట్​లో కాంగ్రెస్​ లీడర్​ మృతి

కార్​ ఆక్సిడెంట్​లో కాంగ్రెస్​ లీడర్​ మృతి

మహాముత్తారం,వెలుగు : మహాముత్తారం కాంగ్రెస్​  మండలాధ్యక్షురాలు కీర్తిబాయి కాంగ్రెస్​   ప్రచారానికి  వెళ్తూ కార్​ ఆక్సిడెంట్​లో  గురువారం చనిపోయింది. కీర్తిబాయి   కాటారం  నుంచి యామన్​పల్లి మీదుగా నిమ్మగూడెం వెళ్తున్నారు.  ఈ క్రమంలో యామన్​పల్లి దాటగానే కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. దీంతో  కీర్తిబాయి అక్కడికక్కడే చనిపోయింది.  కారులో ఉన్న  సీనియర్​ నాయకుడు జాడి రాజయ్య  సైతం తీవ్రంగా గారపడ్డాడు. కీర్తిబాయి మృతి విషయం తెలుసుకున్న ఐటీ మినిస్టర్​  శ్రీధర్​బాబు,ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ   తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.