రాయదుర్గంలోని బీఎన్ఆర్ హిల్స్ లో దోపిడీకి పాల్పడ్డ నేపాల్ గ్యాంగ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దోపీడి గురించి వివరాలను సీపీ సజ్జనార్ మీడియాకు చెప్పారు…వారం రోజుల క్రితం బీఎన్ఆర్ హిల్స్ లో ఉండే బోర్ వెల్ కాంట్రాక్టర్ మధుసూదన్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాల్ దొంగలను పట్టుకున్నామన్నారు. వారి నుంచి రూ. 5లక్షల 20 వేల నగదు,30 తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నామన్నారు. నేత్ర బహదూర్ షాహి, ప్రకాష్ షాహీ, సీతలను అరెస్ట్ చేశామని.. ఇంకో ఆరుగురు పరారీలో ఉన్నారన్నారు.
‘ఈ నెల 5 న రాత్రి మధుసూదన్ భార్య శైలజకు వారి ఇంట్లో పనిచేసే సీత భోజనం, టీలో నిద్ర మాత్రలు కలిపింది. నిద్రపోయాక మిగిలిన గ్యాంగ్ మెంబెర్స్ కి సమాచారం ఇచ్చింది. శైలజని కట్టివేసి కొట్టి బంగారం నగదు ఎత్తుకెళ్లారు. ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో పనిచేసివారితో మాట్లాడి వారి సహాయంతో చోరీకి పాల్పడతారు. చోరి చేశాక తలో దారిలో నేపాల్ చేరుకుంటారు. నేత్ర.. నార్సింగిలో వృద్ధ దంపతులు కట్టివేసి చోరి చేసిన కేసులో ప్రధాన నిందితుడు . ఫిర్యాదు రాగానే 10బృందాలను ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులు సాయంతో వీరిని పట్టుకున్నాం. మరో ఆరుగురికోసం పలు రాష్ట్రాల్లో 10 టీమ్స్ గాలిస్తున్నాయి. రాజస్థాన్,ఢిల్లీ, నేపాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్,కర్ణాటక సరిహద్దులలో బృందాలను పెట్టడంతో నిదితులను పట్టుకోగలిగాం. తెలియని వాళ్ళని పనిలో పెట్టుకోకూడదు, వాళ్ళ వివరాలు స్థానిక పోలీసులకు ఇవ్వండి‘ అని సూచించారు కమిషనర్.
గంజాయి మత్తులో రెచ్చిపోతున్నపోకిరీలు..వీడియో
రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మనా?