సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు
హైదరాబాద్, వెలుగు: పంజరంలో చిలుకలాగా మారిన సీబీఐని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసులో నంబర్ 2 గా చెబుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా పాత్రపైనా తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
సోమ వారం హైదరాబాద్లోని మగ్దూంభవన్లో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, జాతీ య నేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ, ఈటీ నర్సింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్కు ప్రమాణాలపైనే మోజు ఎక్కువ అని విమర్శించారు.