- సీఎం కేసీఆర్కు సీపీఐ లేఖ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా 2004 కంటే ముందు ఉద్యోగాల్లోకి చేరిన టీచర్లకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని సీపీఐ కోరింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.
దేశంలో 2004 నుంచి నూతన పింఛన్ విధానం అమల్లోకి వచ్చిందని, ఉమ్మడి ఏపీలో అదే ఏడాది సెప్టెంబర్ నుంచి అమలు చేశారని గుర్తుచేశారు. అయితే 2003 డిసెంబర్లో రిక్రూట్ అయిన టీచర్లకూ సీపీఎస్ అమలు చేస్తున్నారు. వారందరికీ పాత పింఛన్ విధానం అమలు చేయాలని కూనంనేని కోరారు.