కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నయ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నయ్

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన సీపీఐ నాయకులు.. హిమాయత్ నగర్ AITUC బిల్డింగ్ నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా సీపీఐ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది.