గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేయటం సరికాదు

గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేయటం సరికాదు

గవర్నర్ తమిళి సైని వెంటనే బర్త్ రఫ్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.  సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లరని..ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని  రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైందికాదన్నారు. ఉన్నతమైన గవర్నర్ పదవిలో ఉన్న తనకు రాజకీయాలతో సంబంధమేంటని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని గవర్నర్ తమిళి సై సోమవారం మీడియా చిట్ చాట్ లో అన్నారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులే ఇందుకు కారణం కావొచ్చన్నారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో తనను పోల్చవద్దని, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే స్పందించడం తన బాధ్యత అని గవర్నర్​ తమిళిసై  చెప్పారు. భద్రాచలం ప్రాంతంలో తాను దత్తత తీసుకున్న కొన్ని గ్రామాల్లో గిరిజన ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారని తెలిసి అక్కడికి వెళ్లానని గుర్తు చేశారు.