విజయ్ వంశీపైడిపల్లి మూవీ నుండి క్రేజీ అప్డేట్

విజయ్  వంశీపైడిపల్లి మూవీ నుండి క్రేజీ అప్డేట్

ఇళయదళపతి విజయ్-టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.

ఇక ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ ను జూన్ 21న రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శరత్ కుమార్, ప్రభుతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా వస్తున్న ఈ మూవీ తమిళ్,తెలుగు భాషల్లో రానుంది. కాగా ఈ మూవీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తల కోసం

ఫస్ట్ టైం అలా నటించా..కామెడీ అంటేనే క్రేజీ ఫీలింగ్

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఎవరు?