పంజాగుట్ట, వెలుగు: జోగినీల అభ్యున్నతి కోసం తాను 30 ఏండ్లుగా పోరాడుతున్నానని, ప్రభుత్వాలు జ్యోగినీలపై విమర్శలు చేయడం సరికాదని జోగిని శ్యామల అన్నారు. తాను ఎవరినీ నిందించనని, ప్రభుత్వాలు బాగుంటేనే ప్రజలు బాగుంటారని తెలిపారు.
గురువారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శ్రేణులు, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్శ్రేణులు జోగినీలపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొందరు జోగినీలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో దుర్గా రమేశ్, కల్యాణి, గణేశ్, కిశోర్, లాయర్సాయికృష్ణ పాల్గొన్నారు.
