పెట్రోల్ బంకులో.. నీళ్లు పోశారు.. కూకట్ పల్లిలో షాక్

పెట్రోల్ బంకులో.. నీళ్లు పోశారు.. కూకట్ పల్లిలో షాక్

హైదరాబాద్​లోని ఓ పెట్రోల్​ బంకులో పెట్రోల్​లో నీళ్లు వస్తున్నాయని ఆరోపించిన ఓ కస్టమర్​పై సిబ్బంది దాడికి దిగారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లి సుమిత్ర నగర్​హెచ్​పీ పెట్రోల్​బంకుకి ఓ కస్టమర్​ పెట్రోల్​ కొట్టించడానికి వచ్చాడు. ఫ్యూయల్​క్వాలిటీ తేడా రావడంతో నీళ్లు కలిపిన పెట్రోల్​ అమ్ముతున్నారని కస్టమర్​ ఆరోపించాడు.

ఇదే విషయంపై బంకు సిబ్బందికి, కస్టమర్​కి గొడవ జరిగింది.  అనంతరం కస్టమర్​ కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెట్రోల్​ కల్తీ జరుగుతున్న విషయాన్ని వివరించారు. పెట్రోల్​లో కిరోసిన్​ వాసనా వస్తోందని పోలీసులకు చెప్పారు. బంకును పరిశీలించి కల్తీ జరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.