హైదరాబాద్లోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీళ్లు వస్తున్నాయని ఆరోపించిన ఓ కస్టమర్పై సిబ్బంది దాడికి దిగారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లి సుమిత్ర నగర్హెచ్పీ పెట్రోల్బంకుకి ఓ కస్టమర్ పెట్రోల్ కొట్టించడానికి వచ్చాడు. ఫ్యూయల్క్వాలిటీ తేడా రావడంతో నీళ్లు కలిపిన పెట్రోల్ అమ్ముతున్నారని కస్టమర్ ఆరోపించాడు.
ఇదే విషయంపై బంకు సిబ్బందికి, కస్టమర్కి గొడవ జరిగింది. అనంతరం కస్టమర్ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెట్రోల్ కల్తీ జరుగుతున్న విషయాన్ని వివరించారు. పెట్రోల్లో కిరోసిన్ వాసనా వస్తోందని పోలీసులకు చెప్పారు. బంకును పరిశీలించి కల్తీ జరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.